11న ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా | Mudra News
![11న ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్.. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా | Mudra News](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e72c2c340c8.jpg)
ముద్ర ప్రతినిధి, హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీ లో ఈ నెల 11 న 74 వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నట్లు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏఎస్ రాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. 74 వ బ్యాచ్ లో 195 మంది ట్రైనీ ఐపీఎస్ లు శిక్షణ పొందారని వెల్లడించారు. ఇందులో 166మంది ఇండియన్ ఆఫీసర్స్, 29 మంది ఫారెన్ ఆఫీసర్స్ ఉన్నారని.. ఇందులో 37 మంది మహిళా ఐపీఎస్ లు ఉన్నారని వెల్లడించారు. 105 వారాల పాటు వీరంతా కఠోర శిక్షణ పొందారని పేర్కొన్నారు. ఈ నెల 11 న జరిగే ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారని తెలిపారు. కోవిడ్ తర్వాత జరిగే ఈ పాసింగ్ ఔట్ పరేడ్ను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. రోజు రోజుకూ సైబర్ క్రైమ్స్ పెరుగుతుండటంతో లైవ్ కేసుల ను ఉదాహరణగా చూపించి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ సారి ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే ఎక్కువగా ఉన్నారని వెల్లడించారు.