కాంగ్రెస్ గెలిస్తే మంచిర్యాల అభివృద్ధి

కాంగ్రెస్ గెలిస్తే మంచిర్యాల అభివృద్ధి
  • జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే మంచిర్యాల పురోభివృద్ధి సాధిస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. బుధవారం ఇంటింటా కాంగ్రెస్ పాదయాత్ర ను వికాస్ నగర్ లో వర్షంలోనే నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురుంచి వివరించారు. కాంగ్రెస్ ప్రజా క్షేమాన్ని కోరుకుంటుందన్నారు. మంచిర్యాల పురపాలక సంఘం అనుకున్న స్థాయిలో అభివృధ్ధి సాధించలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి పట్టణ రూపురేఖలు మారుస్తామని భరోసా ఇచ్చారు.