పెంచిన ధరలు..బకాయిలు చెల్లించాలి..

పెంచిన ధరలు..బకాయిలు చెల్లించాలి..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రభుత్వం ముందుగా మధ్యాహ్న భోజన వర్కర్ల పెండింగ్ బకాయిలు చెల్లించడం తో పాటు పెంచిన ధరలు తక్షణమే అందజేయాలని జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్ల దీక్ష శిబిరాన్ని విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ బకాయిలు చెల్లించలేని వారు పాఠశాలల విద్యార్థులకు టిఫిన్ ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటనలు చేయడానికే పరిమితం అవుతోందని, ఆచరణ శూన్యమని, మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.