ఉరేసుకొని ఇంటర్ విద్యార్థి మృతి

ఉరేసుకొని ఇంటర్ విద్యార్థి మృతి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పిక్లా తండా గ్రామ శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోత్ క్రిష్ణ (19) మంగళవారం సాయంత్రం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కృష్ణ ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి, నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. కృష్ణ ఆత్మహత్యకు పాల్పడడం పట్ల కుటుంబంలో విషాదం నెలకొంది. సంఘటన స్థలికి కేసముద్రం ఎస్సై తిరుపతి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.  ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకుని మరణించడం పట్ల తల్లిదండ్రులు లచ్చు జ్యోతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.