కల్లూరు పాఠశాలలో పుస్తకం చదువు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు.

కల్లూరు పాఠశాలలో పుస్తకం చదువు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు.
  • ఘనంగా అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం 

ముద్ర న్యూస్ నేరేడుచర్ల: అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని మంగళవారం నేరేడుచర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత పుస్తకం చదువు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు చదువు కోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. చదువు ద్వారా సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏమి లేదని తెలిపారు. చదువుకుంటనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వెంకటనర్సయ్య. లయన్స్ క్లబ్ సభ్యులు జిలకర రామస్వామి, ఉపాధ్యాయులు గోపి. రామారావు, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.