కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ - జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ - జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన అంతడుపుల నవీన్ రోడ్డు ప్రమాదం లో మరణించగా పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరు అయిన రూ.  2 లక్షల చెక్కును  నవీన్  కుటుంబ సభ్యులకు ఎమ్మేల్యే క్వార్టర్స్ లో  ఎమ్మేల్యే అందజేశారు.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్  మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని పార్టీ కాపాడుకుంటుందని, రాష్ట్రం లోనే 60 లక్షల కార్యకర్తతో సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ బి అర్ ఎస్ అన్నారు.  జగిత్యాల నియోజకవర్గం లో 53 వేల మందికి ప్రమాద భీమా కల్పించిన ఘనత బి అర్ ఎస్ పార్టీది అని అన్నారు. మంచి యువ నాయకుడు  మరణం చాలా బాధాకరం అని, యువకులు బైక్ నడిపే సందర్భం లో హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి మహేష్ ,రూరల్ ఎంపీపీ మహేష్, దామోదర్ రావు,  మాజీ సర్పంచ్ మహేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.