పిఠాపురంలో 60 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో జనసేనాని...
![పిఠాపురంలో 60 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో జనసేనాని...](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_665ec048a2c38.jpg)
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. పిఠాపురంలో ప్రస్తుతం 60 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2019లో ఒకే సీటు గెలిచిన జనసేన ఈసారి సునామీ సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ గ్లాస్ గుర్తు దూసుకెళ్తోంది. అటు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానల్లోనూ జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.