నిర్మల్ లో జర్నలిస్టుల ధర్నా

నిర్మల్ లో జర్నలిస్టుల ధర్నా

డీ పీ ఆర్వో తీరుకు నిరసనగా నినాదాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల కౌంటింగ్ కేంద్రం ఎదుట జర్నలిస్టులు అధికారులు, డిపిఆర్ఓ తిరుమల తీరుకు నిరసనగా ధర్నాకు దిగారు. కౌంటింగ్ ప్రారంభమైనా తమను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. కాగా ఎన్నికల సంఘం ఇచ్చిన ఎంట్రీ పాసులను సైతం పోలీసు అధికారులు ఖాతరు చేయకపోవడం, ఈ విషయంలో డిపిఆర్ఓ తిరుమల స్పందించకపోవడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో డి పి ఆర్ ఓ తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ ధర్నా కొనసాగించారు.