అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

  • డి పి ఆర్ ఓ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
  • ప్రజావాణిలో యూనియన్లకు అతీతంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు
  • సమాచార శాఖ మంత్రికి వినతి పత్రం పంపడంతో పాటు జర్నలిస్టులకు న్యాయం చేస్తానని, ఇంటి స్థలాల కోసం అర్హులైన జర్నలిస్టుల జాబితా  ఇవ్వమన్న దామన్న

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డిపిఆర్ఓ రమేష్  పై చర్యలు తీసుకోవాలని యూనియన్లకు అతీతంగా సీనియర్ జర్నలిస్టు లు  మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ రాం రెడ్డి దామోదర్ రెడ్డి కి సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్(ప్రజావాణి) లో వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో వివరించిన ప్రకారం  ఈనెల 27వ తారీకు శనివారం రోజున మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా డిపిఆర్ఓ వ్యవహరించిన తీరు పలు జర్నలిస్టుల ను మనస్థాపానికి గురి చేసే విధంగా ఆయన వ్యవహారం శైలి ఉందన్నారు. ప్రముఖ పత్రికలు, చానళ్లు అంటూ డిఎస్పీకి ప్రొసీడింగ్స్ పంపడంతో పాటు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు చిన్న చానల్లో పెద్ద చానళ్లు అంటూ విలేకరుల మధ్యన విభేదాలకు డిపిఆర్ఓ కారకుడు అయ్యాడని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. కొందరు విలేకరులను మాత్రమే మున్సిపల్ కార్యాలయంలోనికి అనుమతించి, మిగతా జర్నలిస్టులను అనుమతించకుండా పోలీసులతో అడ్డుకొని అవమానపరిచాడనీ, జోన్ 1 నుండి అక్రమంగా జోన్ 2 లో అర్హత లేకున్నా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడని, అక్రి డీటెయిల్స్ అక్రిడిటేషన్ జారీలో  అవకతవకలకు పాల్పడ్డారని, విలేకరుల మనోభావాలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కించపరిచేలా ప్రవర్తించాలని వారు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు.

ఈ విషయాన్ని పలువురు జర్నలిస్టులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దామోదర్ రెడ్డి కి విషయంపై ఫిర్యాదు చేయడంతో ఆయన వెంటనే స్పందించి డిపిఆర్ఓ రమేష్ పై చర్యలు తీసుకుంటామని, ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రికి పంపిస్తానని, అర్హులైన జర్నలిస్టులకు జాబితా తయారు చేయాలని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, ఐత బోయిన రాంబాబు గౌడ్,  పాల్వాయి జానయ్య, బుక్కా రాంబాబు, నాయిని శ్రీనివాసరావు,గన్నోజు జనార్ధన చారి,  నాగరాజు, సురేష్, ఎరుకల సైదులు గౌడ్, కొండ శ్రీనివాసరావు, మామిడి శంకర్, మామిడి శ్రవణ్, పడిశిరి వెంకట్, నజీర్, జహీర్, నందిపాటి సైదులు, వాసా చంద్రశేఖర్, గిరీష్, వెంకట్రావు, రాజు, ప్రవీణ్, రమేష్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.