రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన జర్నలిస్టులు

రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన జర్నలిస్టులు
Journalists who started relay nirahara deeksha

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: వైరా లో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు భాగంలో జాతీయ రహదారి పక్కన రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ముందుగా వారు ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి జర్నలిస్టులకు తమ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేకు నాలుగేళ్లుగా వినతి పత్రాలు అందిస్తున్నా నేటి వరకు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలేదన్నారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించేంతవరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైరా జర్నలిస్టులు పాల్గొన్నారు.