కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు క్షీరాభిషేకం...

కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు క్షీరాభిషేకం...

ముద్ర, మల్యాల: ఎన్నో ఏళ్ల బానిసత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విముక్తి కల్పించి, 23 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని మండలంలోని వీఆర్ఏలు పేర్కొన్నారు. వీఆర్ఏలకు అర్హత ఆధారంగా పే స్కేల్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వారు సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ లోని వీఆర్ఏలoదరం సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు. అనంతరం కేటీఆర్ జన్మదినo సందర్బంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాజీద్, సల్మాన్, అజ్జు, నర్సయ్య, సాయి, సునీత, సుజాత, మహేష్ తదితరులు పాల్గొన్నారు.