ముదిరాజ్ లను మోసం చేసిన కెసిఆర్
- రాష్ట్రంలోముదిరాజ్ లపై చిన్న చూపు
- తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ ల జనాభా సంఖ్య 60 లక్షలు .
- బిఆర్ఎస్ పార్టీని దించే వరకు మా పోరాటం
ముద్ర, షాద్నగర్:-ముదిరాజ్ లకు బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ మోసం చేసారని, రాష్ట్రం లో బి ఆర్ ఎస్ తరపున పోటీచేయడానికి ముదిరాజ్ లకు ఒక్కరికి కూడా టిక్కెట్లు ఇవ్వకుండా చిన్న చూపు చూసరాణి షాద్ నగర్ నియోజకవర్గం ముదిరాజ్ సంఘం నాయకులు నల్లమోని శ్రీధర్ విమర్శించారు. మంగళవారం షాద్నగర్ లో ముదిరాజ్ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో నిన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాబితాలో ఏ ఒక్క ముదిరాజ్ అభ్యర్థి ఎక్కడ స్థానం కల్పించకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పార్టీలో ముదిరాజ్ లు పార్టీ అభివృద్ధి పార్టీలను బలపరచడంలో ను ప్రతి ముదిరాజ్ లు కృషి చేస్తున్నారు,తెలంగాణ కోసం ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడారు ఓట్ల కోసం వాడుకొని సీట్లు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని అభిప్రాయ పడ్డారు. ముదిరాజ్ లా ఓట్లతో గెలిచి ముదిరాజ్ లను మోసం చేశారు సీఎం కేసీఆర్ అని అన్నారు ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చే నాయకులను అడ్డుకుంటామని అన్నారు తెలంగాణలోని ఏ పార్టీ అయినా బిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్, బీఎస్పీ, తదితర పార్టీలు మా ముదిరాజ్ లాకు అన్యాయం చేస్తే తగిన బుద్ధి చెబుతాం అని షాద్ న నగర్ ముదిరాజ్ సంఘం నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తుమ్మల గోపాల్ ముదిరాజ్, వంగ వెంకటేష్ ముదిరాజ్, చెక్కల శ్రీశైలం ముదిరాజ్, కుడుముల బాలరాజ్ ముదిరాజ్, ప్రశాంత్ ముదిరాజ్, బుడ్డ నరసింహులు ముదిరాజ్, సతీష్ ముదిరాజ్, కె యాదగిరి ముదిరాజ్, నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, తుపాకుల శేఖర్ ముదిరాజ్, మన్నే శేఖర్ ముదిరాజ్ ,నల్లమోని బిక్షపతి తదితరులు పాల్గొన్నారు..