తెలంగాణను లూటీ చేస్తున్న కేసీఆర్ సర్కారు : తరుణ్ చుగ్
తెలంగాణను కేసీఆర్ సర్కారు లూటీ చేస్తోందని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. దోచెయ్... దాచేయ్ అన్నట్లుగా కేసీఆర్ పాలన ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. కేసీఆర్కు ప్రజలు బైబై చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్ దిట్టని చెప్పారు.