తెలంగాణను లూటీ చేస్తున్న కేసీఆర్​ సర్కారు : తరుణ్​ చుగ్​

తెలంగాణను లూటీ చేస్తున్న కేసీఆర్​ సర్కారు : తరుణ్​ చుగ్​

తెలంగాణను కేసీఆర్​ సర్కారు లూటీ చేస్తోందని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​ చుగ్​ అన్నారు. దోచెయ్​... దాచేయ్​ అన్నట్లుగా కేసీఆర్​ పాలన ఉందన్నారు. కేసీఆర్​ ప్రభుత్వం మజ్లిస్​ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. కేసీఆర్​కు ప్రజలు బైబై చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. లిక్కర్​ స్కామ్​పై దర్యాప్తు చేస్తున్న సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డైవర్షన్​ పాలిటిక్స్​ చేయడంలో కేసీఆర్​ దిట్టని చెప్పారు.