హెలికాప్టర్ లో కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలన
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ ఏరియల్ వ్యూ ద్వారా కాళేశ్వరం జలాలతో నిండుకుండలా ఉన్న కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రముఖులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ విహాంగా వీక్షణం చేశారు.
అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కాళేశ్వరం తో సృష్టించిన అద్భుతాలని వారు పేర్కొన్నారు. మండుటెండల్లోనూ జల కళసంతరించుకుందని అన్నారు. తమ సెల్ ఫోన్ లో స్పీకర్ పోచారం, మంత్రి కేటీఆర్ ఫోటోలు తీసుకున్నారు.