మాంటిస్సోరి పాఠశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష

మాంటిస్సోరి పాఠశాలలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ లోని మాంటిస్సోరి గ్రూపు పాఠశాలలో సోమవారం కరాటే బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష జరిగింది. స్టాండర్డ్ షిటోర్యూ ఇంటర్నేషనల్ కరాటే –డూ ఇండియా సంస్థ ఈ పరీక్షను నిర్వహించింది. ఈ పోటీలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కరాటే బెల్ట్ గ్రేడింగ్ కు పి.బాలరాజ్, షేక్ పర్వేజ్ చీఫ్ ఎగ్జామినర్లుగా వ్యవహరించారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరినీ మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్. లహరి చంద్ర అభినందించారు. పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు వివిధ బెల్ట్ సర్టిఫికెట్లను అందించారు.