కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదు
కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. కర్నాటక ప్రజలను ఏమార్చడంలో కేరళ స్టోరీ ఫెయిలైందని అన్నారు. అసహ్యకర రాజకీయాలను, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్నాటక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కర్నాటకలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
కర్నాటక ఫలితాలు నేను చెప్పినట్లే వచ్చాయి
కర్నాటక ఫలితాలు తాను చెప్పినట్లే వచ్చాయన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్కు 25 సీట్లకు మించి రావన్నారు. బీజేపీకి 9, ఎంఐఎంకు 7 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. మిగిలిన సీట్లన్నీ కాంగ్రెసుకే వస్తాయన్నారు.