తెలంగాణ లో కర్ణాటక ఫలితాలు వస్తాయి

తెలంగాణ లో కర్ణాటక ఫలితాలు వస్తాయి

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: తెలంగాణ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్ణాటక తరహాలో కాంగ్రెస్ విజయభేరీ మోగిస్తుందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ధీమా వ్యక్తం చేశారు. గురువారం దండేపల్లి మండలం కొండాపూర్ లో ఇంటింటా కాంగ్రెస్ లో భాగంగా ప్రజలను కలిశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే హామీల గురించి  వివరించారు. ఈసందర్భంగా స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ లో బీఆరెస్ ప్రభుత్వంకు ప్రజలు చరమ గీతం పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.

బీఆరెస్ పాలనతో ప్రజలు విసిగివేసారిపోయారని తెలిపారు. కర్ణాటక లో కాంగ్రెస్ కు పట్టం కట్టినట్లుగానే తెలంగాణ లో ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమ భవిష్యత్తు కు బంగారు మార్గం లభిస్తుందని ప్రజలు విశ్వాసం తో ఉన్నారని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.