తిరుమల తిరుపతి దేవస్థానంలో కాటారం భజన బృందం

తిరుమల తిరుపతి దేవస్థానంలో కాటారం భజన బృందం

ముద్ర న్యూస్, కాటారం: భూలోకంలో కోట్లాది ప్రజల ఇలవేల్పు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అఖండ హరినామ సంకీర్తనలో ఆదివారం కాటారం మండల కేంద్రానికి చెందిన భక్తాంజనేయ భజన బృందం సభ్యులు పాల్గొన్నారు.వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే హరినామ సంకీర్తనలో పాల్గొనే అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతమని వారు సంతోషం వెలిబుచ్చారు.ఈకార్యక్రమంలో భజన బృందం అధ్యక్షులు గౌరోజు శ్రీనివాస్,మండల అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్,బీరెల్లి అంజయ్య, దారం నందకిషోర్,చిలువేరి రూపేష్,తోట సదానందం,తోట శ్రావణ్,ఏలేశ్వరం చంద్రశేఖర్, జంబోజు రాజు,దేవునాయక్, ఆత్మకూరి నవీన్ తదితరులు ఉన్నారు.