పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ముద్ర, హుజురాబాద్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక అన్నారు. పట్టణంలోని 16వ వార్డులో మంగళవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటిని ఎల్లప్పుడూ తొలగించుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. శిథిలావస్థ ఉన్న ఇళ్లల్లో ఉంటున్న వారు... వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీమతి మారపెల్లి సుశీల, కమిషనర్ సల్వాది సమ్మయ్య, ఇన్ చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు,పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.