అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలి...

అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరగాలి...

ముద్ర ప్రతినిధి,అమరావతి:"రానున్న శాసన సభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి  సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నాము" అని శ్రీ పయ్యావుల కేశవ్ అన్నారు.టీడీఎల్పీ లో దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా శ్రీ కేశవ్ మాట్లాడారు.

శాసన సభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు.రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని శ్రీ కేశవ్ తెలిపారు.శాసన సభ కార్యదర్శి శ్రీ పిపికే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి శ్రీ విజయరాజు, ఉప కార్యదర్శి శ్రీ కె. రాజకుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పీఏవో శ్రీమతి కె. పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు, తదితరులు శ్రీ పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలియజేశారు.