ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయిన వైసీపీ కీలక నేతలు వీరే... ఆ ఎనిమిది జిల్లాల్లో వైసీపీకి జీరో..
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో వైసీపీ ఎనిమిది జిల్లాల్లో కనీసం ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన విజయనగరం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ ఈ సారి ఒక్క సీటూ గెలుచుకోకపోవడం గమనార్హం. ఏపీలోని వైసీపీ ముఖ్య నేతలు సైతం ఓడిపోయారు.
ఓడిపోయిన కీలక నేతలు వీరే....
- బుగ్గన రాజేంద్రనాథ్ (వైసీపీ) - డోన్
- వంగా గీత (వైసీపీ) - పిఠాపురం
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైసీపీ) - మాచర్ల
- అంబటి రాంబాబు (వైసీపీ) - సత్తెనపల్లి
- తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి (వైసీపీ) - రాప్తాడు
- కారుమూరి నాగేశ్వర రావు (వైసీపీ) - తణుకు
- కొట్టు సత్యనారాయణ (వైసీపీ) -తాడేపల్లిగూడెం
- రవీంద్రనాథ్ (వైసీపీ) - కమలాపురం
- తానేటి వనిత (వైసీపీ) - గోపాలపురం
- అంజాద్ బాషా (వైసీపీ) - కడప
- ఆళ్ల నాని (వైసీపీ) - ఏలూరు
- జక్కంపూడి రాజా (వైసీపీ) - రాజానగరం
- కోన రఘపతి (వైసీపీ) - బాపట్ల
- కొడాలి నాని (వైసీపీ) - గుడివాడ
- వల్లభనేని వంశీ (వైసీపీ) - గన్నవరం
- గుడివాడ అమర్నాథ్ (వైసీపీ) - గాజువాక
- చెల్లుబోయిన వేణుగోపాల్ (వైసీపీ) - రాజమండ్రి రూరల్
- బొత్స సత్యనారాయణ (వైసీపీ) - చీపురుపల్లి
- మార్గాని భరత్ (వైసీపీ) - రాజమండ్రి సిటీ
- ఆర్కే రోజా (వైసీపీ) - నగరి
ఈ 8 జిల్లాల్లో జీరో
- కృష్ణా
- గుంటూరు
- తూర్పు గోదావరి
- విజయనగరం
- శ్రీకాకుళం
- నెల్లూరు
- పశ్చి గోదావరి
- ప్రకాశం