ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధం

ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధం

సకల సౌకర్యాలు, విశాలమైన గదులు, ఆధునిక హంగులు, చుట్టూ అందమైన హరితవనంతో నందనవనాన్ని తలపించేలా అందరికీ అందుబాటులో ఉండేలా ఖమ్మం నగరం శివారు వివి పాలెం జాతీయ రహదారి ప్రక్కన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సిద్ధం చేశారు. రూ.53.20 కోట్ల నిధులతో 20.10 ఎకరాల విస్తీర్ణంలో జి ప్లస్ 2 పద్దతిలో భవన నిర్మాణం చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంఛనంగా ప్రారంభించనున్నారని అదికారులు తెలిపారు. ఆయన వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇతర అతిథులు హాజరవుతారని చెప్పారు. అతిథులందరికీ కొత్త కలెక్టరేట్లోనే భోజనాలు ఏర్పాటు చేశారు.