చేవెళ్లలో కొండా విజయం ఖాయం కొండా సంగీత రెడ్డి

చేవెళ్లలో కొండా విజయం ఖాయం కొండా సంగీత రెడ్డి

భారీ జన సందోహం మధ్య కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్

రంగారెడ్ది, ముద్ర: నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రమేన్నారు ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి. సోమవారం చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆమె చెప్పారు. చేవెళ్లలో మరోసారి గెలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో స్థానిక సమస్యల అన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు.

మే 13ను హాలిడే కాకుండా పోలింగ్ డేగా భావించాలని కొండా సంగీతా రెడ్డి కోరారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి భారతీయ జనతా పార్టీకి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. బలమైన దేశంగా భారతదేశం విలసిల్లడానికి ప్రజలంతా బిజెపిని గెలిపించాలని కోరారు. మరోసారి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీ ల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చారని కానీ ఆ గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని కొండా సంగీతారెడ్డి ఆరోపించారు. ఈ సమావేశంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజా సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.