పుపాలగూడ లో  అర్థిక సమస్యలతో లాయర్ ఆత్మహత్య

పుపాలగూడ లో  అర్థిక సమస్యలతో లాయర్ ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది..
పుప్పాలగూడలో నివసించే ముఖర్జీ అనే అడ్వకేట్ తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలోని అడ్వకేట్ ముఖర్జీ బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ముఖర్జీ భార్య కూడా ముఖర్జీకి దూరంగా నివసిస్తుంది.