రంగారెడ్డి  అడవిలో చిరుత పులి మృత్యువాత

రంగారెడ్డి  అడవిలో చిరుత పులి మృత్యువాత
  • చౌదర్గుడ మండలంలో ఘటన
  • సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు

ముద్ర ప్రతినిధి, షాద్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో అనుమానస్పద పరిస్థితిలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది. గత ఐదారు మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు. శనివారం ఉదయం అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు.

ఈ సంఘటనపై అటవీశాఖ అధికారులని  సంప్రదించగా వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. పెద్ద ఎల్కిచర్ల ఆడవి 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని తెలిపారు. ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గొర్ల కాపరులకు చిరుత మరణించిన విషయం తెలుసుకొని గ్రామంలో ఈ సమాచారాన్ని చెప్పారు. దీంతో సమాచారం అందుకున్న అటవి శాఖ సిబ్బంది ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. చిరుత పులి పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఈ చిరుత పులి ఎలా మరణించి ఉంటుందని దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదలా ఉండగా క్రూరమృగాలు సంచరిస్తున్న ఈ అటవీ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అటవీశాఖ అధికారులు చిరుతపులులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..