నిరంకుశ అప్రజాస్వామిక కేసీఆర్ కుటుంబాన్ని గద్దే దింపుదాం
![నిరంకుశ అప్రజాస్వామిక కేసీఆర్ కుటుంబాన్ని గద్దే దింపుదాం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647c9419c4590.jpg)
- తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: నిరంకుశ అప్రజా స్వామిక అవినీతి కెసిఆర్ ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెలంగాణ జన సమితి రాష్ట్ర 3వ ప్లీనరీ లో ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా అన్ని రంగాల్లో తెలంగాణ విలువలు దిగజారిపోతున్నాయని ఆయన విమర్శించారు ఇలాంటి నియంతృత్వ ముఖ్యమంత్రిని గద్దె దింపుట కొరకు సామాజిక ప్రజా స్వామిక తెలంగాణ నిర్మాణం కొరకు జన సమితి ఎన్నికల్లో రంగం సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ బిజెపిలు కేసీఆర్ ఎదుర్కొనే స్థితిలో లేవని బిజెపి నేమో కెసిఆర్ పట్ల రాజకీయ స్వార్థంతో కూడుకున్న ఉదార వైఖరితో వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేమో కెసిఆర్ ను ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించు కోవడంలో విఫలమవుతుందని ఆయన అన్నారు.
సామాజిక ప్రజాస్వామిక శక్తులను పౌర సమాజాలతో సరికొత్త అలయన్స్ రూపొందించి కెసిఆర్ ను ఓడగోడతామని ఆయన అన్నారు. కొన్ని పత్రికలలో కావాలని జన సమితి పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఏదో పార్టీలో విలీనం కాబోతున్నమని రాస్తున్నారని ఇది ప్రజలను పక్కదో పట్టియడమేనని ఆయన అన్నారు తెలంగాణ జన సమితి కచ్చితంగా స్వతంత్ర ఉనికితో నిలబడి కల బడుతుందని తెలంగాణ జన సమితి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పార్టీ నిర్ణయించిన సీట్లలో అభ్యర్థుల గెలుపు కొరకు పోరాడాలని పిలపునిచ్చారు రాజకీయాలను వ్యాపారంచేసి ఆర్థిక ,రాజకీయాన్ని కలగలుపు చేసుకున్నటువంటి కెసిఆర్ దుష్టపాలనను అంతమొందించాలని ఆయన కోరారు. ప్లీనరీలో లో పలు అంశాలపై పార్టీ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించారు.
తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు అనంతరం పార్టీ సంస్తా గత ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సత్యనారాయణ ఎన్నికల కోసం అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్ స్వీకరించగా కోదండరామును బలపరుస్తూ మాత్రమే నామినేషన్లు ఫైల్ చేసినందున కోదండరాముని మరో దఫా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది ఈ ప్లీనరీలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వరరావు ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్ గోపగాని శంకర్రావు ముఖ్యరాజు ఆశప్ప నిజ్జన రమేష్ యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీం పాషా విద్యార్థి సమితి నాయకులు అరుణ్ సర్దార్ వినోద్ నారబోయిన కిరణ్ గట్ల రమా శంకర్ మల్లయ్య యాదవ్ బొమ్మగాని వినయ్ గౌడ్, కంబాలపల్లి శ్రీనివాస్ యాకోబు రెడ్డి , వలికి గోవర్ధన్ కొల్లు కృష్ణారెడ్డి బచ్చలకూరి గోపి సూర్యనారాయణ బంధన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు జనసమితి కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.