విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం: పోకల
ముద్ర న్యూస్ గరిడేపల్లి:నల్లగొండ పార్లమెంట్ పరిధిలో చేపట్టిన విజయ సంకల్పయాత్ర నేడు మన గరిడేపల్లి మండలానికి చేరుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని భాజాపా జిల్లా ఉపాధ్యక్షులు, టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ పోకల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికకు గీటు రాయిగా నిలవనుందన్నారు. సందర్భంగా మండల కేంద్రంలోని పైడిమర్రి ఫంక్షన్ హాల్ లో రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోలిశెట్టి అంజయ్య , సుందరి రమేష్, మన్నెం మట్టారెడ్డి, రావుల ఆంజనేయులు, పులి చింతల నరేందర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, మలికంటి శ్రీనివాస్ తదితరులున్నారు.