చిన్న మల్లారెడ్డిలో పోలీసుల మెరుపు దాడి

చిన్న మల్లారెడ్డిలో పోలీసుల మెరుపు దాడి

-రూ.3.26లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఒక ఇంట్లో అక్రమంగా మద్యం నిలువ ఉంచారనే సమాచారంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించి రూ.3.26 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నారు.  దేవనపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై  తన సిబ్బంది, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అధికారుల సహాయంతో  చిన్న మల్లారెడ్డి గ్రామానికి వెళ్ళారు.  

అక్కడ బాణాల చిన్న పెద్దులు అనే వ్యక్తి ఇంట్లో తనిఖీ చేయగా రాయల్ స్టాగ్ 180ML 1656 బాటిళ్లు లభించగా, దీని విలువ సుమారు రూ. 3,26,370- ఉంటుంది. ఇలా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని సీజ్ చేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ మద్యాన్ని అక్రమంగా నిలువ ఉంచిన బాణాల చిన్న పెద్దులు, మద్యాన్ని అమ్మిన వైన్స్ యజమానిపైన దేవనపల్లి పోలీస్ స్టేషన్లో  కేసు నమోదు చేశారు. ఎవరైనా మద్యం అక్రమ నిలువలకు పాల్పడితే వాటిని సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.