టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినా గుర్తింపు ఇవ్వని లోక్సభ సచివాలయం
![టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినా గుర్తింపు ఇవ్వని లోక్సభ సచివాలయం](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_63ff08ad56c1c.jpg)
దిల్లీ: టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా లోక్సభ సచివాలయం గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ నుంచి టీఆర్ఎస్ను తొలగించింది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు. బుధవారం సమావేశానికి ఆయన్ను ఆహ్వానితుడిగానే లోక్సభ సచివాలయం ఆహ్వానం పంపింది.
ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. టీఆర్ఎస్కు లోక్సభలో 9 మంది సభ్యులున్నా లోక్సభ సచివాలయం తొలగించింది. లోక్సభ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది. ఆహ్వానం పంపితేనే భేటీకి హాజరుకావాల్సి ఉంటుంది.