టీఆర్​ఎస్​ బీఆర్​ఎస్ గా  మారినా గుర్తింపు ఇవ్వని లోక్‌సభ సచివాలయం

టీఆర్​ఎస్​ బీఆర్​ఎస్ గా  మారినా గుర్తింపు ఇవ్వని లోక్‌సభ సచివాలయం

దిల్లీ: టీఆర్​ఎస్​ బీఆర్​ఎస్​గా  మారినా లోక్‌సభ సచివాలయం గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ నుంచి టీఆర్​ఎస్​ను  తొలగించింది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు. బుధవారం సమావేశానికి ఆయన్ను ఆహ్వానితుడిగానే లోక్‌సభ సచివాలయం ఆహ్వానం పంపింది.

ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది.  టీఆర్​ఎస్​కు  లోక్‌సభలో 9 మంది సభ్యులున్నా  లోక్‌సభ సచివాలయం తొలగించింది. లోక్‌సభ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్​ఎస్​ కొనసాగనుంది. ఆహ్వానం పంపితేనే భేటీకి హాజరుకావాల్సి ఉంటుంది.