బీజేఎల్పీ నేతగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

బీజేఎల్పీ నేతగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అసెంబ్లీలో బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఖరారు చేస్తూ బిజెపి ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ ఎల్పీ నేతలుగా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట రమణ రెడ్డి లను ఖరారు చేసింది. ఈ మేరకు అధికారికంగా లేఖను అసెంబ్లీ సెక్రెటరీకి  రాష్ట్ర పార్టీ లేఖను అందజేసింది.చీఫ్ విప్ గా పాల్వాయి హరీష్ బాబు. విప్ గా సూర్య నారాయణ, బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పాటిల్, ట్రెజరర్ గా రాకేష్ రెడ్డి లను అధికారికంగా అధిష్టానం ప్రకటించింది.