జీవితంలో నా ప్రతిక్షణం తుంగతుర్తికే  అంకితం: ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్

జీవితంలో నా ప్రతిక్షణం తుంగతుర్తికే  అంకితం: ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్
  • శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కిశోర్
  • క్రేన్ సాయంతో గజమాలతో సన్మానించిన బీఆర్ఎస్ శ్రేణులు
  • ర్యాలీలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ముద్ర:-తెలంగాణ ఉద్యమంలో జీవితంలో ప్రతిక్షణం, దేహంలో ప్రతి కణం తెలంగాణే అంకితమని చెప్పానని.. మళ్లీ అదే చెబుతున్నానని జీవితంలో ప్రతిక్షణం దేహంలో ప్రతి కణం తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి  అంకితమని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు.

బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సుమారు 1500కు పైగా ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన  ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, తనను రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యకర్తల ప్రేమాభిమానాలకు అనురాగాలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఎమ్మెల్యేడాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ప్రత్యేక పూజలు చేసి అనంతరం ర్యాలీగా తిరుమలగిరికి వెళ్లారు. ఈ మేరకు కార్యకర్తలు ఎమ్మెల్యేను క్రేన్ సాయంతో గజమాలతో ఘనంగా సన్మానించారు.