ఇంటింటి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం 

ఇంటింటి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం 

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణంలోని ఇందిరా నగర్ లో ఎమ్మెల్యే  కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు ఆయన స్థానిక శ్రీపచ్చలకట్ట సోమేశ్వరాలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనను చూసి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని అన్నారు.

గత బీఆర్ ఎస్ ప్రభుత్వ అవినీతి, బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో చామల గెలుపు ఖాయమన్నారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు.  ప్రచారంలో ఆయన వెంట స్థానిక నాయకులు,  కార్యకర్తలు ఉన్నారు.