కౌన్సిలర్లకు అధికారులకు సమన్వయ లోపం ఉండకూడదు...

కౌన్సిలర్లకు అధికారులకు సమన్వయ లోపం ఉండకూడదు...
  • ప్రభుత్వ అధికారులు విధివిధానాలను విస్మరించకూడదు
  • వనపర్తి పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి

ముద్ర. వనపర్తి:-ప్రజలతో ఎన్నుకోబడి ప్రజా సమస్యల పరిష్కారానికై పాటుపడే కౌన్సిలర్లు తీర్మానించిన ప్రతి సమస్యపై అధికారులు దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని.అధికారులకు కౌన్సిలర్లకు మధ్య సమన్వయ లోపం రాకుండా చూసుకొని అధికారులు వారి వారి విధి విధానాలను విస్మరించకుండా ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యాఖ్యానించారు.ప్రభుత్వపరంగా మున్సిపాలిటీకి ఆదాయాన్నిచ్చే  హౌస్ టాక్సెస్ ఇతర వాటిపై అధికారులు దృష్టి సారించాలని అధికారులు వారి విధులను ఎందుకు విస్మరిస్తున్నారని ఆయన   ప్రశ్నించారు.మున్సిపల్ సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఇకపై జరిగే ప్రతి మున్సిపాలిటీ సమావేశానికి అందరూ అధికారులు తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారుల ఆదేశించారు.

మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు అందరూ వ్యతిరేకించే పనులపై, సమస్యలపై కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా తీర్మానాలు తయారుచేసి  వాటిని  అమలు చేయాలన్నారు.స్వీపింగ్ మిషన్ కొన్న సమయంలో అందుకు సంబంధించిన వారంటిని ఎందుకు చూసుకోలేదని వారంటీని పరిశీలించి ఆ కంపెనీకి సంబంధించిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.రోడ్డు వైన్డింగ్ లో 10 కోట్లకు పైగా పెండింగ్ పనులు ఉన్నాయని వాటి నిధులకు సంబంధించి ఇప్పటికే  ముఖ్యమంత్రి గారితో కలెక్టర్తో చర్చించమని అందుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేదని పనులు ఎప్పటిలాగే కొనసాగుతాయని,పనుల ఏర్పాటులో పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు.ప్రభుత్వం మారితే ఇలాంటి ఇబ్బంది ఉండదని చిన్నచిన్న మార్పులు మినహా పనులకు సంబంధించి మార్పులేవి పెద్దగా ఉండవని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ స్థానిక సంస్థల కలెక్టర్ గాంగ్వార్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి, కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.