బాసర అమ్మవారిని దర్శించుకుని ముధోల్ నూతన ఎమ్మెల్యే

బాసర అమ్మవారిని దర్శించుకుని ముధోల్ నూతన ఎమ్మెల్యే

బాసర, ముద్ర:-నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని బుధవారం ఉదయం ముధోల్ నియోజక వర్గ నూతన ఎమ్మెల్యే రామారావు పటేల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి వచ్చిన ఆలయ మర్యాదలతో సత్కరించి స్వాగతం పలికారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ...

భారీ మెజారిటి తో నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో తోడు ఉంటానని అన్నారు.చదువుల తల్లి సరస్వతి అమ్మవారి ఆశీర్వాదాలతో 75 సంవత్సరాల నుండి నియోజకవర్గ ప్రజల కల నా గెలుపుతో సాకారం అయింది... ముధోల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగిరింది.కుల మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కలను సాకారం చేస్తా.ఎమ్మెల్యే గా ముధోల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పాటు పడతా అని అన్నారు.ముఖ్యం గా అసెంబ్లీ లో విద్య,వైద్యం, ఏరిగేషన్ కోసం కొట్లాడతాను.బీఆర్ఎస్ ప్రభుత్వం బాసర అభివృద్ధి ని మరచింది.యాదాద్రి తరహా లో బాసర ని తీర్చి దిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించి ఆలయ అభివృద్ధి చేస్తా అని అన్నారు.ఆయన వెంట బాసర జెడ్పీటీసీ వసంత రమేష్, ఎంపీపీ సునీత విశ్వనాథ్, బాసర మాజీ సర్పంచ్ సతీష్ రావు, నాయకులు పోగుల రాజేశ్వర్, కిషోర్ దేశాయ్, సీ హెచ్ సాయినాథ్, బిద్దుర్ రమేష్, పిసి సాయినాథ్, బాసర మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.