ఎమ్మెల్యే క్యాంపు ముట్టడి భగ్నం

ఎమ్మెల్యే క్యాంపు ముట్టడి భగ్నం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల లో వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ బీజేపీ తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడి కార్యక్రమంను పోలీస్ లు భగ్నం చేశారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. అయితే అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు క్యామ్పు ఆఫీస్ లోపలికి వెళ్లకుండా భారీ కేడ్లు అడ్డుగా పెట్టారు. బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అటువైపు రాగానే పోలీస్ లు వారి ని అడ్డుకున్నారు. ధీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ గోదావరి, రాళ్ళవాగు బ్యాక్ వాటర్ తో నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ పరంగా పరిహారం ఇప్పటి వరకు మంజూరు కాలేదని విమర్శించారు.