ఫైళ్ల శేఖర్ రెడ్డి గెలుపు కోరుతూ
- ఎమ్మెల్యే కూతురు పైళ్ల మన్వితారెడ్డి వార్డులలో ఇంటింటి ప్రచారం
ముద్ర ప్రతినిధి భువనగిరి :భువనగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఫైళ్ల శేఖర్ రెడ్డి గెలుపు కోరుతూఎమ్మెల్యే కూతురు పైళ్ల మన్వితారెడ్డి వార్డులలో ప్రచారం నిర్వహించారు. గురువారం పట్టణంలోని 8, 9, 23వ వార్డులలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ గొమారి సుధాకర్ రెడ్డి, నాయకులు ఎన్నబోయిన జహంగీర్, కాంచనపల్లి నర్సింగరావు, కొలుపుల నాగరాజు, రత్నపురం పద్మ, సిద్దుల పద్మ పాల్గొన్నారు.