శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
![శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f46090dce68.jpg)
ముద్ర ప్రతినిధి భువనగిరి : ఇందూ జ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల పోస్టర్ ని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈనెల 6 నుండి 12 వరకు ఏడు రోజులు భువనగిరి టౌన్ కిళానగర్ కోటకింద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగనున్నాయి.
12న మంగళవారం శ్రీకృష్ణుడి పల్లకి ఊరేగింపు సేవలో అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, కౌన్సిలర్ లు కిరణ్ కుమార్, అజీమ్, మాజీ కౌన్సిలర్ ఇట్టబోయిన సబితా గోపాల్, నర్సింగ్ రావు, ఇందూ జ్ఞాన వేధిక సభ్యులు దేవేంద్ర, శంకర్, లక్ష్మీనారాయణ, నరేష్, శ్రీనాథ్ శివ, మహేందర్, లతా, లలిత ధనలక్ష్మి పాల్గొన్నారు.