ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వారి ధాన్యం  కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ప్రారంభించారు. బుధవారం కొత్తూరు, వెంకట్రావుపేట, డౌడపల్లి, కొమ్ముగూడెం, పాత కొమ్ముగూడెం, చందారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్ లను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. రైతులు ధాన్యం అమ్మడాని దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, టీఆరెస్ నాయకుడు నడిపెళ్లి విజిత్ రావు, ప్రజాప్రతినిధులు, బీఆరెస్ నేతలు పాల్గొన్నారు.