ఎమ్మెల్యే అబద్దపు ప్రచారం అంటూ వైరల్...

ఎమ్మెల్యే అబద్దపు ప్రచారం అంటూ వైరల్...

ముద్ర, మల్యాల: మండలంలోని మానాల గ్రామానికి చెందిన తరాల రాజ్ కుమార్ ఇటీవల గల్ఫ్ లొ మృతి చెందగా, డెడ్ బాడీ స్వగ్రామం రావడానికి కృషి చేసినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్పుకోవడం అబద్దపు ప్రచారమంటూ సోషల్ మీడియాలొ వైరల్ అవుతుంది. దీనికి సంబందించిన వీడియోను కొందరు పోస్ట్ చేయగా, చాల మంది షేర్ చేయడం గమనార్హం.

అయితే ఆ వీడియోలొ ఓ వ్యక్తి మాట్లాడుతూ మృతుని బంధువు కర్ణాకర్ విజ్ఞప్తి మేరకు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో, ఎంబాసి అధికారుల సహకారంతొ తాము మృతదేహాన్ని ఇంటికి పంపిస్తే చొప్పదండి ఎమ్మెల్యే తానే రప్పించినట్లు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నాడు. గౌరవప్రధమైన ఎమ్మెల్యే హోదాలో ఉండి అబద్దం చెప్పడం ఏంటని, ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడి, మృతదేహాన్ని తెప్పించారో చెప్పాలని అన్నారు. కాగా, అoబులెన్స్ కూడా తామే ఏర్పాటు చేసినట్లు యువకుడు వీడియోలొ పేర్కొన్నాడు.