ఎంపీడీవో కతలప్ప సేవలు చిరస్మరణీయం

ఎంపీడీవో కతలప్ప సేవలు చిరస్మరణీయం

ముద్ర.వీపనగండ్ల:-ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు సర్వసాధారణమని వారు పనిచేసే చోట ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని ఎంపీపీ కమలేశ్వర్ రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఎంపీడీవోల బదిలీల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాకు బదిలీ అయిన ఎంపీడీవో కతలప్పకు కార్యాలయ సిబ్బంది,తాజా మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు ఉపాధి హామీ పథకం సిబ్బంది ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

ఎంపీడీవో కతలప్ప గడిచిన మూడు నర్ర సంవత్సరాలలో మండలంలోని గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని,హరితహారం లో చెట్లు పెంపకానికి చాలా కృషి చేశారని,అధికారులను,పంచాయతీ కార్యదర్శిలను నొప్పించకుండా మండల ప్రజా సమస్యలుపరిష్కారం కోసం కృషి చేశారని అన్నారు.కార్యక్రమంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాస్ రావు,వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్,వనపర్తి జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్,తాజా మాజీ సర్పంచ్లు నరసింహ రెడ్డి,రఘునాథరెడ్డి,అంజయ్య,రమేశ్వర్రావు,మౌలాలి,పదమ్మ,ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,నాయకులు బలస్వామి, సురేష్ రెడ్డి,కృష్ణ,వేంకట స్వామి,అధికారులు,పంచాయతీ కార్యదర్శి లు పాల్గొన్నారు.