బిజెపి లో చేరిన మామడ మాజీ ఎంపిపి లలిత

బిజెపి లో చేరిన మామడ మాజీ ఎంపిపి లలిత

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా మామడ మండల మాజీ అధ్యక్షురాలు దేవోళ్ళ లలిత చక్రపాణి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బుధవారం బిజెపి లో చేరారు. గతంలో అధికార పార్టీలో ఉన్న లలిత కొన్ని మాసాలుగా తటస్థంగా ఉన్నారు. వీరితో పాటు గంగపుత్ర సంఘ సభ్యులు కొండ్ర నర్సయ్య, కొండ్ర రంజిత్, భూమన్న, యాదవ సంఘ సభ్యులు, పద్మశాలి సంఘ సభ్యులు, మరియు దళిత సంఘ సభ్యులు దాదాపు 300 వందల మందికి పైగా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి  సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో బాపురెడ్డి, చిన్నారెడ్డి, నర్సారెడ్డి, లింగా రెడ్డి, గోవర్ధన్, రమేష్ రెడ్డి, నర్సారెడ్డి, నారాయణ్ రెడ్డి, లచ్చన్న, బండి రాజేశ్వర్, నరేష్, శ్రీనివాస్,నవీన్,శేఖర్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.