ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
  • మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ భీమనపల్లి సైదులు

ముద్ర ప్రతినిధి, నల్గొండ/మునుగోడు: ప్రజా సమస్యలపై గలమెత్తి ప్రశ్నించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కిష్టాపురం ఎంపీటీసీ భీమనపల్లి సైదులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలు తీర్చే విధంగా మాట్లాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మునుగోడు నియోజకవర్గంలో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో పార్లమెంటులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ఒప్పించి తెలంగాణ సాధనలో భాగస్వాములైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.