ఉత్తం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పొనుగోడు ఎంపిటిసి వెంకటరమణ

ఉత్తం సమక్షంలో కాంగ్రెస్లో చేరిన పొనుగోడు ఎంపిటిసి వెంకటరమణ

ముద్ర న్యూస్ గరిడేపల్లి: గరిడేపల్లి మండలం పొనుగోడు  బిఆర్ఎస్ ఎంపిటిసి -2, మేళ్లచెరువు వెంకటరమణ  బి.ర్.స్. పార్టీకి రాజీనామా చేసి, గురువారం హైదరాబాదులో మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కటకం రమేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కటకం లక్ష్మీనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు నేలపట్ల వెంకటేశ్వర్లు, నాయకులు వనపర్తి గురువయ్య, కటకం రామకృష్ణ, అందే చంటి, దాసరి శ్రీనివాస్ మచ్చ హుస్సేన్, రాంబాబు గౌడ్, రాజేష్ మధు మనోజ్ మైసయ్య తదితరులు పాల్గొన్నారు.