జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ

జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్ పోస్టు ల నిర్వహణ

దొంగలమర్రి, రాయపట్నం చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు ఎస్పీ వినోద్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కొడిమ్యాల, ధర్మపురి పోలీస్ స్టేషన్ల పరిధిలోని  దొంగలమర్రి, రాయపట్నం  వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను అదనపు ఎస్పీ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ  మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్ పోస్ట్ లు కీలకపాత్ర వ్యవహరిస్తాయని  అన్నారు.  జిల్లాలో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా బోర్డర్  చెక్ పోస్టులను  పకడ్బందీగా నిత్యం  వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా లోనికి  అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్ పోస్టు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు