14న మంచిర్యాల సభలో పాల్గొననున్న మల్లిఖార్జున్ ఖర్గే

14న మంచిర్యాల సభలో పాల్గొననున్న మల్లిఖార్జున్ ఖర్గే

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల శివారులో ఈనెల 14వ తేదీన ఏర్పాటు చేసిన బహిరంగ సభ కు ఏ.ఐ. సీ.సీ.అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరవుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు.  ఆదివారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న సభ 14న ఖరారు అయినట్లు తెలిపారు. మల్లిఖార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ లో తొలిసారి మంచిర్యాల లో ఏర్పాటు చేస్తున్న సభకు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. అంబేద్కర్ జయంతి రోజున సభను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. సభ సాయంత్రం నాలుగు గంటలకు ఆరంభమవుతుందని తెలిపారు. సభకు జాతీయ, రాష్ట్రీయ ముఖ్య నేతలు హాజరవుతారని ఆయన వివరించారు.