దేశవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న భౌతికదాడులను అరికట్టాలి ..
![దేశవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న భౌతికదాడులను అరికట్టాలి ..](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64f1ca5e1efa6.jpg)
మామిడి వెంకట్ రెడ్డి ఐలు జిల్లా అధ్యక్షులు డిమాండ్
భువనగిరి,ముద్ర ప్రతినిధి: దేశవ్యాప్తంగా న్యాయవాదులపై భౌతిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదుల చాంబర్లోకి వెళ్లి ప్రత్యర్ధులుహత్య చేశారని ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి కోరారు.
న్యాయవాదిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా న్యాయవాదులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే న్యాయవాదులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన కోరారు. న్యాయవాదులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే న్యాయవాదులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసు అధికారులపై చట్ట రీత్యా తగిన చర్య తీసుకోవాలని ఆయన ఆయన డిమాండ్ చేశారు.