ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ముద్ర, మల్యాల: జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. గంగాధర మండలం రాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య (42)  అనే వ్యక్తి జగిత్యాల నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రాజారం వద్ద కారును ఓవర్ టేక్ చేస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎల్లయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్ఐ1 అబ్దుల్ రహీం తెలిపారు.