పలువురిపై కోతుల దాడి

పలువురిపై కోతుల దాడి

ముద్ర, మల్యాల: మల్యాల మండల కేంద్రంలో గురువారం కోతుల దాడిలో పలువురికి గాయలయ్యాయి. స్థానిక బీసీ కాలనీకి చెందిన శ్రీరాముల లక్ష్మిపై కోతులు దాడి చేసి గాయపరచగా, ఆమె కింద పడి ఎడమ కాలు విరిగింది. అలాగే సమీపంలోని మరో ఇద్దరు చిన్నారులు కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కింద పడడంతో సిరి అనే చిన్నారికి పన్ను విరిగింది. లక్ష్మిని జగిత్యాలలోని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆమెకు ఆపరేషన్ కు రక్తం అవసరం పడడంతో పోతరాజు రాజేందర్  రక్తం దానం చేశాడు.  కోతుల బారినుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.