మైలార్‌దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

మైలార్‌దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

ముద్ర,రంగారెడ్డి:-రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టాటా నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతం అంత వ్యాపించింది. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో స్థానికులు ఇంట్లో నుండి బయటకు పరుగులు తీసి వెంటనే సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.