శ్రీ గంగమ్మ తల్లి  అనుగ్రహముతో  ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

శ్రీ గంగమ్మ తల్లి  అనుగ్రహముతో  ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

ప్రతి ఒక్కరు మైసమ్మ తల్లీ అనుగ్రహం పొందాలి

కోదాడ, ముద్ర: శ్రీ గంగమ్మ తల్లీ అనుగ్రహముతో ప్రజలందరూ  సుఖ సంతోషాలతో ఉండాలి అని  శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్   అన్నారు. సోమవారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో  యాదవుల ఆరాధ్య దైవం  గంగమ్మ  తల్లి జాతర మహోత్సవ  కార్యక్రమంలో ఎమ్మెల్యే   పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.గత తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తుంది అని,ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉన్నారని వారు అన్నారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే     ని సన్మానించారు.ఈ కార్యక్రమంలో  సర్పంచి వెంపటి భీష్మారావు, గ్రామ శాఖ అధ్యక్షులు వీరబోయిన  గురవయ్య యాదవ్, యువత నాయకుల బొల్లం రాజశేఖర్, బెల్లంకొండ ఉపేందర్, గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.